– జనగామలో టెన్షన్
– ముత్తిరెడ్డి అనుచరుల నిరసన ప్రదర్శన
– తమనేతకు టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్
– భారీగా మోహరించిన పోలీసులు
ఇదేనిజం, జనగామ: జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. తమ నేతకే టికెట్ ఇవ్వాలంటూ ముత్తిరెడ్డి అనుచరురులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పల్లా గోబ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు జనగామలో పోలీసులు సైతం భారీగా మోహరించారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి అనుచరులు మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ముత్తిరెడ్డికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి సహరించబోమని స్పష్టం చేశారు. జనగామ టికెట్ పల్లారాజేశ్వర్ రెడ్డికి ఇవ్వబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి అనుచరులు రంగంలోకి దిగారు. జనగామలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.