Homeతెలంగాణ#Hyderabad #KTR : పంచతత్వ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

#Hyderabad #KTR : పంచతత్వ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Panchatatva Park‌ was made available to the people of the city.

The acupressure walking track constructed at Indira Park was inaugurated by Municipal and IT Minister KTR on Sunday morning.

నగర ప్రజలకు పంచతత్వ పార్క్‌ అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్క్‌లో నిర్మించిన ఆక్యుప్రెజర్‌ వాకింగ్‌ ట్రాక్‌ను మున్సిపల్‌, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం ఉదయం ప్రారంభించారు.

ఎనిమిది అంశాలతో ఎకరం విస్తీర్ణంలో ఈ ట్రాక్‌ను నిర్మించారు. కంకర రాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక, చెక్కపొట్టు, గులకరాళ్లతో నిర్మించిన ఈ ట్రాక్‌ మీద నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలోని నరాలపై ఒత్తిడి పడుతుంది.

అంతేకాకుండా ట్రాక్‌ సర్కిల్‌లో వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ ‌గౌడ్‌‌, నగర మేయర్‌ బొంతు రామ్మెహన్, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img