పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం కూడా భారత్కు ఒక్క పతకం కూడా దక్కలేదు. అయితే నేడు భారత్కు కీలక ఈవెంట్స్ ఉన్నాయి. భారత గోల్డెన్ భాయ్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా నేడు బరిలోకి దిగనున్నాడు. అతనితో పాటు కిషోర్ జెనా కూడా క్వాలిఫికేషన్ రౌండ్లో పోటీపడనున్నాడు. అలాగే మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు క్వార్టర్ ఫైనల్లో చైనాతో తలపడనుంది. స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ రంగంలోకి దిగనున్నాడు. ముఖ్యంగా సెమీస్లో భారత హాకీ జట్టు జర్మనీతో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఒక మెడల్ భారత్ ఖాతాలో చేరినట్లే.. చుడాలి మరి ఎం జరుగుతుందో..?