మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడామహారాష్ట్రలోని పది నియోజకవర్గాల్లో ఎన్డీయే తరపున ప్రచారం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల విజయంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. మహారాష్ట్రలో విజయం సాధించిన ఎన్డీయే మహాయుత కూటమికి అభినందనలు. ఈ విజయం ప్రధాని మోదీపై మహారాష్ట్ర ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది.ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలం సత్యం, శౌర్యం మరియు న్యాయానికి ప్రతీక అని మరోసారి నిరూపించబడింది. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ నాయకత్వం ప్రజల్లో విశ్వాసాన్ని నింపింది.మహాయుతి కూటమి అభ్యర్థుల తరపున మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం నాకు దక్కిన గౌరవం. మరాఠా ప్రజలు చూపిన ప్రేమ, ఆప్యాయతలను మరచిపోలేను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.