Homeతెలంగాణpatnam:పట్నం ప్రమాణ స్వీకారం లేట్​

patnam:పట్నం ప్రమాణ స్వీకారం లేట్​

– అందుబాటులో లేని గవర్నర్​ తమిళిసై
– ఎల్లుండి కేబినేట్​ విస్తరణ?

ఇదేనిజం, హైదరాబాద్​: పట్నం మహేందర్​ రెడ్డిని రాష్ట్ర కేబినెట్​ లోకి తీసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈటల రాజేందర్​ స్థానాన్ని పట్నంతో భర్తీ చేయించాలని కేసీఆర్​ భావిస్తున్నారు. నిజానికి ఇవాళే ఆయనతో రాజ్​ భవన్​ లో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంది. అయితే తాను అందుబాటులో ఉండటం లేదని గవర్నర్​ తమిళిసై సౌందర్​ రాజన్​ చెప్పడంతో పట్నం ప్రమాణం కాస్త వాయిదా పడింది. 24 వ తేదీ (గురువారం) ఆయన ప్రమాణ స్వీకారం ఉండే చాన్స్​ ఉంది. పట్నం మహేందర్​ రెడ్డితో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ ను కేబినెట్​ లోకి తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో రాజీనామా చేయించి.. ఆ పదవి గోవర్దన్ కు ఇవ్వబోతున్నట్టు సమాచారం.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img