పవర్స్టార్ పవన్ కళ్యాన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ల క్రేజీ కాంబినేషన్ అంటే అభిమానులకు పండగే. అయతే త్వరలోనే మరోసారి ఈ కాంబినేషన్కు అంతా సిద్దమైనట్లు తెలుస్తుంది. అయితే ఈ సారి త్రివిక్రం సొంత కథ కాకుండా మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రాన్ని తెలుగులో రిమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ రీమేక్లో నటించడానికి పవన్ కూడా ఆసక్తిగా ఉన్నారు. అయితే దీంట్లో చిన్న సమస్య కూడా ఉంది. ఈ రీమేక్లో నటించడానికి ఇప్పటికే రానా, రవితేజ ప్లాన్ చేశారట. ఇద్దరు హీరోలకు అవకాశం ఉండే ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తుల గొడవతో ఒక ఊరు ఎంత ఇబ్బంది పడిందన్నదే ఈ కథ మేయిన్ లీడ్ అని తెలుస్తుంది. మలయాళంలో బిజుమీనన్, పృథ్విరాజ్ నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే పవన్ గట్టిగా ప్రయత్నిస్తే రవితేజ లేదా రాణాలు పవన్తో ఉన్న స్నేహం వల్ల డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఏ ఒక్కరు డ్రాప్ అయినా పవన్కు ఈ సినిమా మల్టీస్టారర్ హిట్గా నిలిచే అవకాశముంది.