PBKS vs KKR : ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నేడు మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎందుకుంది. దీంతో కోల్కతా మొదట బౌలింగ్ చేయనుంది.
పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడింది. అందులో మూడు మ్యాచ్ల్లో విజయం సాధించగా, మరో రెండింటిలో ఓడిపోయింది.
అలాగే కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడిన కేకేఆర్ మూడు మ్యాచ్ల్లో ఓడిపోగా మరో మూడు మ్యాచ్ల్లో గెలిచింది.
పంజాబ్ కింగ్స్ జట్టులో ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, నేహల్ వధేరా, మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, ఒమర్జాయ్, మార్కో జాన్సన్, అర్ష్దీప్, ఛాహల్ ఉన్నారు.
కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో సునీల్ నరైన్, క్వింటన్ డికాక్, రహానే, రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, రస్సెల్, రమణ్దీప్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్/మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.