Homeహైదరాబాద్latest Newsదారితప్పుతోన్న లైఫ్‌స్టైల్

దారితప్పుతోన్న లైఫ్‌స్టైల్

ఉరుకులు పరుగు జీవితంలో పడి ఆనారోగ్యం పాలవుతున్నారు చాలామంది. టైంకి తినకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. చిరుతిళ్లు, ఫాస్ట్‌పుడ్ తింటూ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. ఆస్పత్రుల పాలవుతున్నారు.

ఈ ఆఫీసు టైమింగ్ లు కూడా పూర్తిగా వేర్వేరు సమయాలలో ఉంటున్నాయి. దీని వల్ల కొందరు నైట్ షిప్ట్ లు చేస్తుంటే, మరికొందరు డే షిఫ్ట్ లు చేస్తున్నారు. దీని వల్ల జీవ గడియారం పూర్తిగా పాడైపోతుంది. టిఫిన్ లను స్కిప్ చేయడం చేస్తుంటారు. లంచ్ చేసే సమమంలో టిఫిన్ లను తింటుంటారు. ఇక రాత్రికి డిన్నర్ ఏ పడుకునే ముందు తింటుంటారు. దీని వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ పూర్తిగా పాడైపోతుంది. ఇలా ఇష్టమున్నట్లు ఫుడ్ ఐటమ్స్, నచ్చిన సమయానికి తినడం వల్ల లేని పోని ఆరోగ్య సమస్యలు వచ్చిపడుతున్నాయి.

టైమింగ్ లేక

చాలా మంది టైమ్ ప్రకారం ఫుడ్‌ను అస్సలు తీసుకొవడంలేదు. దీని వల్ల శరీరంలో ఆ సమయానికి కొన్నిరకాల రసాయనాలు విడుదలవుతాయి. వీటికి కావాల్సిన ఫుడ్ లను జీర్ణంచేయడం ఆ రసాయనాల పని. మనం ఫుడ్ తీసుకొక పోవడం వల్ల అవి అంతర్గత అవయవాలపై ప్రభావం చూపిస్తాయి. అందుకు మనకు కొన్నిసార్లు కడుపులోపల మంటగా అన్పిస్తుంటుంది. వేడి పదార్థాలు, కారం పదార్థాలు తినగానే అబ్‌నార్మల్‌గా అనిపిస్తుంటుంది.

ఇష్టంతో ఏదైనా

నార్మల్ గా చాలా మంది ఉదయం పూట ఏదైనా టిఫిన్ ఐటమ్స్ తింటుంటారు. కానీ కొందరి జీవన విధానం పూర్తిగా అబ్ నార్మల్ గా ఉంటోంది. ఉదయంపూట చైనీస్ ఫుడ్ లు, ఫాస్ట్ ఫుడ్ లను తింటుంటారు. టీ లు, కాఫీలు తాగుతూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. జంక్ ఫుడ్ లను తినడం వల్ల శరీరంలో జీర్ణక్రియ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. దీనివల్ల అనేక ప్రభావాలు మన శరీరంలో కన్పిస్తాయి.

జీవక్రియలు

మన శరీరంలో పోషణ, శ్వాసక్రియ, విసర్జన, రవాణ, ప్రత్యుత్పత్తి మొదలైన జీవన క్రియలు ఉంటాయి. ఇవి సక్రమంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. వీటిల్లో ఏది సరిగ్గా పనిచేయకున్న మనం తొందరగా వ్యాధుల బారిన పడుతుంటాం. అందుకు మనం ఆహారంగా తీసుకునే ప్రతిఒక్క పదార్థం మనపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతుంటారు.

రాత్రిపూట తినకూడనివి

ముఖ్యంగా రాత్రిపూట కొన్ని పదార్థాలు తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతిని పొత్తికడుపులో నొప్పి ఏర్పడుతుంది. ముఖ్యంగా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీల వంటి వాటిని రాత్రిపూట అస్సలు తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి తొందరగా జీర్ణం కావు. అంతేకాకుండా.. వీటిలో ఉండే ఘాటు వల్ల పొట్టలో స్టమక్ రిలేటేడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.

కొందరిలో చికెన్, మటన్ తినగానే పొట్ట ఉబ్బినట్టుగా ఉంటుంది. వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. ఇక చైనీస్ ఫుడ్, స్పైసీ ఫుడ్ లకు రాత్రిపూట ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. అదే విధంగా శెనగ పిండితో చేసిన పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. కెఫిన్ లు ఎక్కువగా ఉండే కాఫీలు, టీలకు కూడా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి తీసుకోవడం వల్ల మననిద్రను ప్రభావితం చేస్తాయి. మనిషికి కంటినిండా సరిపడా నిద్రలేకుంటే అనేక రకాలు సమస్యలు వస్తాయి. అందుకే రాత్రిపూట ఈ పదార్థాలను అస్సలు తినొద్దని నిపుణులు చెప్తున్నారు.

Recent

- Advertisment -spot_img