Phone Tapping Case: తెలంగాణాలో ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు విచారణలో సంచలనాలు వాస్తవాలు బయటికి వస్తున్నాయి. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ హైకోర్టులో పని చేస్తున్న 18 మంది న్యాయమూర్తుల వివరాలు ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్లో ఉన్నాయని తేలింది. అందులో ఐదుగురు మహిళా న్యాయమూర్తుల సమాచారమూ ఉంది. ఎఫ్ఎస్ఎల్ నివేదికలోని పూర్తి వివరాలు బహిర్గతమైతే మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.