Homeహైదరాబాద్latest Newsదయచేసి సాయం చేయండి.. బాధితుడిని దాతలు ఎవరైనా ఆదుకోవాలని వేడుకోలు

దయచేసి సాయం చేయండి.. బాధితుడిని దాతలు ఎవరైనా ఆదుకోవాలని వేడుకోలు

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, దొంతపూర్ గ్రామానికి చెందిన సర్ధ లక్ష్మణ్ గ్రామంలో ఎలక్ట్రికల్ అండ్ జనరల్ స్టోర్ షాప్ నడిపిస్తున్నాడు. గత నెల 18న (18-07-2024) భార్యాభర్తలిద్దరూ బైకుపై జగిత్యాల్ హాస్పటల్ వెళుతుండగా బీర్పూర్ వద్ద గ్రామ పంచాయతీ బ్లేడ్ ట్రాక్టర్ బైకును ఢీకొట్టడంతో భార్యాభర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జగిత్యాల లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లి వారం రోజులు చికిత్స పొందుతున్నప్పటికీ తీవ్ర అవస్థ గురి కావడం చేత హైదరాబాదులో కొంపల్లి లోని రెనోవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న క్రమంలో ఒక కాలు తీసివేయడం జరిగింది.ఇప్పటి వరకు 10 లక్షల రూపాయలు ఖర్చు కావడం జరిగింది. ప్రస్తుతం వెంటిలేషన్ పైన చికిత్స పొందుతున్నాడు. రోజుకు 1,20,000 ఖర్చు అవుతుంది. కావున దాతలు ఎవరైనా దయచేసి మాకు తగినంత సహాయాన్ని అందించగలరని సర్దా జమున కొరారు.
Google pay/ Phonepe:
8106776863 (Sarda Karthik),
7993587326 (Sarda Ganga Kalyani).

Recent

- Advertisment -spot_img