యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్రం పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే పీఎం ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తు గడువు మార్చి 12తో ముగుస్తుంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, ITI లేదా డిగ్రీ పూర్తి చేసిన 21-24 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగులు అర్హులు. వారి కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. దీని ద్వారా దేశంలోని టాప్-500 కంపెనీల్లో ఏడాది పాటు ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు. నెలకు రూ.5000 స్టైఫండ్, వన్ టైం గ్రాంట్ కింద రూ.6 వేలు ఇస్తారు. ఈ వెబ్సైట్ https://pminternship.mca.gov.in/login/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.