Homeజాతీయంరైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు

రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు

• 8.5కోట్ల రైతుల అకౌంట్లలోకి పైసలు జమ చేసిన ప్రధాని
• ఒక్క క్లిక్‌తో రూ.17 వేల కోట్లు విడుదల

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ స్కీమ్) దేశవ్యాప్తంగా ఒకే రోజు 8.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.17,100 కోట్లను ప్రధాని నరేంద్ర మోడీ జమ చేశారు. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్ లైన్ లో నగదు బదిలీ చేశారు. పీఎం కిసాన్ పథకం కింద పేద రైతులకు ఏటా రూ.6వేల ఆర్థిక సహాయాన్ని మూడు విడతలుగా(రూ.2వేలు చొప్పున) అందజేస్తున్న విషయం తెలిసిందే. 2018, డిసెంబర్ 1 నుంచి ఈ పథకం అమలవుతుంది. తాజాగా ఆరో విడత కింద నిధులను విడుదల చేశారు. ఈ పథకం కోసం కేంద్రం రూ.75 వేల కోట్లు కేటాయించిది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. భూమిని దున్నే నాగలిని ఆయుధంగా మలుచుకున్న భగవాన్ బలరాముడి జయంతి కూడా ఇవాళేనని గుర్తుచేశారు. ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ అభినందనలు తెలిపారు. హలధారి జయంతి నాడే రైతులకు ఎంతో మేలు చేసే పీఎం కిసాన్ నిధులను వారి ఖాతాల్లో జమచేయడం ఆనందంగా ఉందన్నారు. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదును చేర్చడం ద్వారా ఈ పథకం గొప్ప విజయాన్ని సాధించిందని అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img