PMSYM Scheme: పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందించే పథకాలలో ఒకటి. అసంఘటిత రంగ కార్మికులకు వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం ద్వారా కార్మికులు 60 సంవత్సరాలు నిండిన తర్వాత నెలకు రూ. 3,000 పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకంలో చేరడానికి, మీరు మీ సేవా కేంద్రాలను సందర్శించి మీ వివరాలను అందించి దరఖాస్తు చేసుకోవచ్చు.