పాక్ ఆక్రమిత కశ్మీర్ విదేశీ భూ భాగమేనని పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్ కోర్టులో అంగీకరించింది. POKలో పాక్ చట్టాలు చెల్లవని స్పష్టం చేసింది. ఓ జర్నలిస్ట్ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. pok విదేశీ భూ భాగమైతే పాక్ రేంజర్లు, మిలిటరీ ఎందుకు చొరబడుతున్నారని చురకలంటించింది. కాగా ఈ వ్యాఖ్యలతోభారత్ కు మరింత బలం చేకూరినట్లయింది. pok భారత్ లో అంతర్భాగమేనని, 1947 నుంచే ఆక్రమణకు గురవుతోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ చెబుతూ వస్తున్నారు.