సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ సుధీర్ కుమార్కు గత నెల కరోన పాజిటివ్ రాగా ఇటీవలే కరోన నుంచి కోలుకొని తిరిగి విధుల్లో చేరాడు. రాచకొండ కమీషనర్ మహేశ్ భగవత్, జాయింట్ కమీషనర్ సుదీర్ బాబు సూచన మేరకు సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో కరోన చికిత్స పొందుతున్న మునిరాజ కుమార్ (59) అను వ్యక్తికి ప్లాస్మా అవసరం కావడంతో సుధీర్ కుమార్ స్వచ్చందంగా ముందుకు వచ్చి హాస్పిటల్కు వెళ్ళి మునిరాజ కుమార్కు ప్లాస్మా దానం చేయడం జరిగింది. కానిస్టేబుల్గా విధుల్లో ప్రజలకు రక్షణ కల్పించడమే కాకుండా ప్లాస్మా దానం చేసి మరొకరి ప్రాణాలకు రక్షణగా నిలవడం పై పలువురు అభినందిస్తున్నారు.
కరోనాను జయించి మరొకరికి ప్లాస్మాను దానం చేసిన కానిస్టేబుల్
RELATED ARTICLES