HomeరాజకీయాలుPolitics : గువ్వలపై మరోసారి దాడి

Politics : గువ్వలపై మరోసారి దాడి

– మట్టిపెళ్లతో దాడిచేసి మతిస్థిమితం లేని వ్యక్తి

ఇదేనిజం, అచ్చంపేట: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్​పై మరోసారి దాడి జరిగింది. శనివారం రాత్రి ఆయన మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకొని డిశ్చార్జ్​ అయ్యారు. కాగా తాజాగా మరోసారి దాడి జరగడం గమనార్హం. సోమవారం ఆయన అమ్రబాద్​ మండలం కుమొరోనిపల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి మట్టి పెళ్లతో దాడి చేశాడు. బీఆర్ఎస్​ కార్యకర్తలు ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా సదరు వ్యక్తి కి మతిస్థిమితం లేదని సమాచారం. నిందితుణ్ని పర్వతాలుగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే గువ్వలపై కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు సార్లు దాడులు జరగడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img