ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదానీతో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం తక్షణం ఏపీ సీఎం చంద్రబాబు రద్దు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేసారు. అక్రమ డీల్ తో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం రూ. 1.50 లక్షల కోట్లు కాబట్టి వెంటనే ఈ డీల్ రద్దు చేయాలని ఆమె తెలిపారు. ఈ విషయంపై కూటమి భుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అని వైఎస్ షర్మిల తెలిపారు.