Homeహైదరాబాద్latest Newsహామీలతో అధికారం.. గెలిచాక పంగనామం

హామీలతో అధికారం.. గెలిచాక పంగనామం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఎనిమిది నెలలైనా హామీల అమలు అంతంత మాత్రంగానే ఉంది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల విద్యుత్, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ మాత్రమే అమలవుతున్నాయి. ఇటీవలే రైతుల పంట రుణాలు రూ.లక్ష వరకు మాఫీ చేశారు. రైతుభరోసా ఇవ్వలేదు. ఇక కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయలేదు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు నిరుద్యోగులకు మొండి చేయే చూపారు. దీంతో హామీలతో అధికారంలోకి వచ్చి.. గెలిచాక పంగనామం పెట్టారంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img