Homeహైదరాబాద్latest Newsప్రభాస్​ అయోధ్యకు 50 కోట్ల విరాళం ఇవ్వలేదు

ప్రభాస్​ అయోధ్యకు 50 కోట్ల విరాళం ఇవ్వలేదు

– ఆ న్యూస్​ ఫేక్.. ప్రభాస్​ టీం క్లారిటీ

అయోధ్యలో రామ్‌లల్లా జనవరి22న అంగరంగవైభవంగా కొలువుదీరనున్న వేళ… ఓ రెండు న్యూస్‌లు త్రూ అవుట్ ఇండియా వైరల్ అవుతున్నాయి. అందర్నీ షాక్ అయ్యేలా.. వావ్‌ అనేలా కూడా చేస్తున్నాయి. అందులో.. ప్రభాస్‌ అయోధ్యకు 50కోట్లను.. విరాళంగా ఇచ్చారనే న్యూస్ ఒకటి కాగా… ప్రారంభోత్సవం రోజు భోజనాల ఖర్చంతా.. ప్రభాసే భరిస్తున్నారనేది మరో న్యూస్. అయితే ఈ న్యూస్‌లపైనే తాజాగా క్లారిటీ ఇచ్చింది ప్రభాస్ టీం. అయోధ్యకు ప్రభాస్‌, 50 కోట్లను విరాళంగా ఇచ్చిన న్యూసు.. దాంతో పాటే.. ప్రారంభోత్సవం రోజు భోజన ఖర్చంతా భరిస్తున్నారనే న్యూస్‌ అబద్దం… పూర్తిగా ఫేక్ అంటూ… తాజాగా ఆయన టీం చెప్పింది. ఈ వార్తలను ఎవరూ నమ్మొద్దని కోరింది. అయితే రీసెంట్‌గా.. ఏపీ కోనసీమ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి.. అయోధ్య ప్రారంభోత్సవంలో భోజనాల ఖర్చంగా ప్రభాసే భరిస్తున్నారంటూ చెప్పారు. దీంతో నేషనల్ మీడియా ఈయన మాటలను కోట్ చేస్తూ… న్యూస్‌ ఫైల్ చేసింది. అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవడంతో.. అదే నిజమని అందరూ అనుకునే వచ్చింది. ప్రభాస్‌ టీం రంగంలోకి దిగి క్లారిటీ కూడా ఇవ్వాల్సి వచ్చింది.

Recent

- Advertisment -spot_img