Homeజిల్లా వార్తలుKCR కోలుకోవాలంటూ పూజల..

KCR కోలుకోవాలంటూ పూజల..

– భద్రాద్రి క్షేత్రంలో ముగిసిన హోమం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు తన నియోజకవర్గపరిధిలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.కేసీఆర్‌ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన మహనీయుడని.. పదేండ్లు ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని మాధవరం కొనియాడారు. కేసీఆర్‌ ఆరోగ్యం త్వరగా బాగుపడాలని దేవుడిని కోరుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ జూపల్లి సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్‌ తులసీరావుతదితరులు పాల్గొన్నారు.కేసీఆర్ కోలుకోవాలంటూ భారత జాగృతి ఆధ్వర్యంలో భద్రాద్రి పుణ్యక్షేత్రంలో చేపట్టిన హోమం శనివారంతో ముగిసింది. శ్రీరాముడి సన్నిధిలో రెండు రోజులపాటు హోమాది ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Recent

- Advertisment -spot_img