Homeహైదరాబాద్latest Newsరాష్ట్రంలో కరువుకు గత ప్రభుత్వమే కారణం.. అందుకే కాంగ్రెస్ లో చేరా: కడియం

రాష్ట్రంలో కరువుకు గత ప్రభుత్వమే కారణం.. అందుకే కాంగ్రెస్ లో చేరా: కడియం

బీజేపీతో మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్ తోనే సాధ్యమని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్ లో చేరానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. తన కుమార్తె కావ్యతో కలిసి హనుమకొండలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అధికార పార్టీలో చేరినట్లు కడియం తెలిపారు.

కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. మరోసారి మోసం చేసేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ఆయనకు ఏటీఎంలా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చిన కరువుకు గత ప్రభుత్వమే కారణమన్నారు. ఆ పార్టీ నేతలు ధర్నా చేస్తే ప్రజలే తరిమికొడతారని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img