కెనడియన్ ఖలిస్థానీ వేర్పాటువాది మరణంలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ఆరోపించిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాది తర్వాత లావోస్లో జరిగిన ఆసియాన్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జస్టిన్ ట్రూడో సమావేశమయ్యారు. తదుపరి చేయాల్సిన పని ఉందని ట్రూడో మెడితో చెప్పినట్లు కెనడా మీడియా పేర్కొంది. “భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నేను మోడీతో సమావేశమయ్యాను మరియు అనేక విషయాలపై చర్చించాను.వివరాల్లోకి వెళ్లను కానీ.. నేను ఎప్పుడూ చెబుతున్నట్లుగా కెనడియన్ల భద్రత, చట్టబద్ధపాలనే మా ప్రభుత్వ బాధ్యతలు. వాటిపైనే దృష్టి సారించా’’ అని ప్రధాని జస్టిన్ పేర్కొన్నారు.