ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన రద్దయింది. తుపాను హెచ్చరికల కారణంగా ఈ నెల 29న జరగాల్సిన మోదీ పర్యటన రద్దు చేసుకున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా అనకాపల్లి పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు శంకుస్థాపన, కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారు. అలాగే ఏయూ కళాశాల మైదానంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.