10 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. గచ్చిబౌలి స్టేడియం మొదటి దశ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రారంభ మ్యాచ్లో తెలుగు టైటాన్స్-బెంగళూరు బుల్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు పోరు ప్రారంభమవుతుంది. లీగ్ ప్రారంభం నుంచి తెలుగు టైటాన్స్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. కానీ టైటిల్ దొరకని ద్రాక్షగా మిగిలిపోయింది. టైటాన్స్ అత్యుత్తమ ప్రదర్శన రెండో సీజన్లో మూడో స్థానంలో నిలిచింది. తాజాగా తెలుగు టైటాన్స్ జట్టు ప్రదర్శన పేలవంగా కొనసాగుతోంది. గత మూడు సీజన్లలో పాయింట్ల పట్టికలో అట్టడుగున 12వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో టైటాన్ రాత మారుతుందో లేదో చూడాలి.