HomeతెలంగాణAgnipath : రణరంగంగా రైల్వే స్టేషన్ ఎంఎంటీఎస్ సర్వీసుల రద్దు

Agnipath : రణరంగంగా రైల్వే స్టేషన్ ఎంఎంటీఎస్ సర్వీసుల రద్దు

Agnipath : రణరంగంగా రైల్వే స్టేషన్ ఎంఎంటీఎస్ సర్వీసుల రద్దు

Agnipath : అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది.

రైల్వే స్టేషన్లోకి చొచ్చుకొచ్చిన వేలాది మంది ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు రైళ్లకు నిప్పుపెట్టి అక్కడి ఆస్తులను ధ్వంసం చేశారు.

ఉదయం 8.30 గంటలకు మొదలైన ఆందోళన ఇంకా కొనసాగుతోంది.

తొలుత మొదట మూడు, నాలుగు వందల మంది విద్యార్థులు స్టేషన్ లోకి చొచ్చుకొచ్చారు.

ఆ తర్వాత మరింత మంది ఆందోళన కారులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఇంతమంది ఒక్కసారిగా దాడి చేయడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

తమ వస్తువులను రైళ్లలోనే వదిలిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు.

ఆందోళన కారులను అదుపు చేసేందుకు రైల్వే పోలీసులతో పాటు రాష్ట్ర పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

పోలీసులపై ఆందోళన కారులు రాళ్లు రువ్వ రువ్వారు. దాంతో, అదనపు బలగాలను స్టేషన్లో మోహరించారు.

పట్టాలపైకి వచ్చిన ఆందోళన కారులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు తర్వాత గాల్లోకి కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో పలువురికి గాయాలైనట్టు సమాచారం.

రైల్వే స్టేషన్లో హింస నేపథ్యంలో శుక్రవారం అన్ని ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img