Homeజిల్లా వార్తలుభారీ వర్షానికి కూలిపోయిన పూరి గుడిసె ..!

భారీ వర్షానికి కూలిపోయిన పూరి గుడిసె ..!

ఇదే నిజం, కుక్కునూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొండపల్లి గ్రామానికి చెందిన మారుపాక పెద్ద పున్నయ్య పూరి గుడిసె వర్షం తాకిడికి నేలమట్టమయింది అని ఆవేదన వ్యక్తం చేశాడు. నిరుపేద కుటుంబం ఇల్లు కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నారు. కొండపల్లి గ్రామంలో పలువురి ఇండ్లు కూడా ఇదే దుస్థితి అని కంటతడి పెడుతున్నారు. అలాగే మిట్ట గూడెం గ్రామంలో డ్రైనేజీ లో వర్షపు నీరు పోటెత్తి మరో పూరీ ఇల్లు దెబ్బ తిన్నది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇళ్లలోకి నీరు చేరుతున్నాయని వీధిలైట్లు వెలగట్లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు పరిశీలించి సహాయం చేయగలరని బాధితులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img