మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా ప్రమోషన్ అంటే హీరో, హీరోయిన్, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాతలు ఇలా మొదలైన చిత్ర బృందం అంతా ఏ ఈవెంట్ లోనైన పాల్గొంటారు. అయితే ఈ మధ్య కాలంలో చిత్రబృందంలోని కొంతమంది మాత్రం సినిమా ప్రమోషన్స్ కి హాజరుకావడం లేదు. అయితే ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా ప్రొమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో డైరెక్టర్ సుకుమార్ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. మొన్న పాట్నాలో జరిగిన భారీ ఈవెంట్ కి సుకుమార్ రాలేదు.. అలానే నిన్న చెన్నలో జరిగిన ‘పుష్ప 2’ మూవీ వైల్డ్ ఫైర్ ఈవెంట్ కి కూడా డైరెక్టర్ సుకుమార్ రాలేదు. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ కి సుకుమార్ ఎందుకు రావడం లేదో అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే మెగా ఫ్యామిలీతో అల్లుఅర్జున్ కి ఉన్న విబేధాలు కారణంగా సుకుమార్ ఈ సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటున్నాడా.. అని తెలియాల్సి ఉంది. ఎందుకుంట సుకుమార్ తరువాత రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా వల్ల ఏమైనా ప్రమోషన్స్ కి రావడం లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అయినా సుకుమార్ వస్తాడో లేదో చూడాలి. అయితే నిన్న చెన్నైలో జరిగిన ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ..సుకుమార్ ఈ సినిమా ఎడిటింగ్ పనుల్లో బిజీగా ఉండి రాలేకపోయాడు అని తెలిపాడు.