Homeహైదరాబాద్latest NewsRTC బస్సెక్కిన రాహుల్, రేవంత్ : Hyderabad

RTC బస్సెక్కిన రాహుల్, రేవంత్ : Hyderabad

– ఫ్రీ బస్సు స్కీమ్​పై మహిళలతో ముచ్చటించిన నేతలు
– సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. గురువారం రాత్రి సరూర్​నగర్​లో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ ముగిసిన అనంతరం రాహుల్, రేవంత్.. దిల్​సుఖ్​నగర్​లో సిటీ బస్సు ఎక్కి కొద్ది దూరం జర్నీ చేశారు. మహిళలు, యువతతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన ఫ్రీ బస్సు స్కీమ్​పై ఆరా తీశారు. ఇతర పథకాలపై గురించి వారితో మాట్లాడారు. అనంతరం బస్సులో ఉన్న ప్రయాణికులకు కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీలను పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది

Recent

- Advertisment -spot_img