Railway station : రైల్వేస్టేషన్ (Railway station) లిఫ్టులో 14 మంది ప్రయాణికులు ఇరుక్కుపోయి 3 గంటలపాటు నరకయాతన అనుభవించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారమ్లను మార్చడానికి 14 మంది ప్రయాణికులు లిఫ్ట్ ఎక్కారు. పరిమితి దాటిన తర్వాత లిఫ్ట్ ఆగిపోయింది.అయితే తలుపులు తెరుచుకోకపోవడం కారణంగా దాదాపు 3 గంటలు లిఫ్టులోనే ప్రయాణికులు ఉండిపోయారు. ప్రయాణికుల కేకలు విని లిఫ్ట్ వద్దకు వచ్చిన పోలీసులు.. టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగి ప్రయాణికులను పోలీసులు కాపాడారు.