Rajamouli : ఇండియా – పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో వార్ అప్ డేట్స్ అంటూ కొంత మంది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో రాజమౌళి ఒక ట్విట్ ను పోస్ట్ చేసారు. భారత సైనిక కదలికలను ఫోటోలు లేదా వీడియోలుగా తీయవద్దు అని.. సోషల్ మీడియాలో ఆర్మీ సమాచారాన్ని షేర్ చేయవద్దని రాజమౌళి సూచించారు. అలా చేయడం శత్రువుకు పరోక్షంగా సహాయం చేయడమేనని, నిర్ధారించని వార్తలను ఫార్వార్డ్ చేయవద్దని కోరారు. ప్రశాంతంగా అప్రమత్తంగా ఉండండి అని రాజమౌళి ట్వీట్ చేసారు. ఈ ట్వీట్లో ఆయన “విజయం మనదే” అంటూ సందేశం ఇచ్చారు.