Homeహైదరాబాద్Rajiv Gandhi International Airport Expansion Plan : రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ ప్రణాళిక

Rajiv Gandhi International Airport Expansion Plan : రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ ప్రణాళిక

Rajiv Gandhi International Airport Expansion Plan : రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ ప్రణాళిక..

హైదరాబాద్‌ నుంచి విమానయాన గమ్యస్థానాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ ప్రణాళిక శరవేగంగా అమలు జరుగుతున్నది.

ఈ ప్రణాళికలో భాగంగా టర్మినల్‌, ఎయిర్‌సైడ్‌ ప్రాంతాల్ని అభివృద్ధిపరుస్తున్నారు.

ఈ విమానాశ్రయ నిర్వహణా సంస్థ జీఎమ్మార్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎక్కువ విమానాల్ని నిలిపిఉంచేందుకు మరిన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌ స్టాండ్‌ల్ని, విమానరాకపోకలకు మరిన్ని రన్‌వేలను నిర్మిస్తున్నట్లు తెలిపింది.

తొలుత వార్షికంగా 1.2 కోట్ల మంది ప్రయాణికుల నిర్వహణా సామర్థ్యంతో ప్రారంభమైన ఈ ఎయిర్‌పోర్ట్‌… విస్తరణ తర్వాత 3.2 కోట్ల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించే సామర్థ్యం నెలకొంటుందని జీఎమ్మార్‌ పేర్కొంది. వివరాలివీ…

  1. విస్తరణ తర్వాత ఎయిర్‌సైడ్‌లో బోయింగ్‌ 737-700, ఏ320 సైజ్‌ విమానాల్ని నిలపగల 93 కోడ్‌ సీ ఎయిర్‌క్రాఫ్ట్‌ స్టాండ్‌లు ఉంటాయి.
  2. వీటిలో 44 కాంటాక్ట్‌ స్టాండ్‌లు కాగా, 49 రిమోట్‌ స్టాండ్‌లు.
  3. వెస్ట్రన్‌ ఏప్రాన్‌లో అంతర్జాతీయ కార్యకలాపాల కోసం అదనంగా 17 కాంటాక్ట్‌ స్టాండ్‌లు, ఒక రిమోట్‌ స్టాండ్‌ నెలకొంటాయి.
  4. దేశీయ విమానాల రాకపోకలు సాగించే ఈస్ట్రన్‌ ఏప్రాన్‌లో అదనంగా 17 కాంటాక్ట్‌ స్టాండ్‌లు, 4 రిమోట్‌ స్టాండ్‌లు ఏర్పాటవుతాయి.
  5. రన్‌వే సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు ఇటీవల కొత్తగా నాలుగు ర్యాపిడ్‌ ఎగ్జిట్‌ ట్యాక్సీవేలను ప్రారంభించారు.
  6. ఈ ట్యాక్సీవేలతో విమానాలు తక్కువదూరంలోనే రన్‌వే నుంచి గాలిలోకి ఎగరగలుగుతాయి. తద్వారా రన్‌వే ఆక్యుపెన్సీ సమయం తగ్గి, రన్‌వే సామర్థ్యం మెరుగుపడుతుంది.
  7. సెకండరీ రన్‌వే ఉపయోగించేటపుడు కా ర్యకలాపాలు సజావుగా సాగేందుకు కొ త్తగా ఒక సమాంతర ట్యాక్సీవే నిర్మించారు.
  8. విమానాలు, గ్రౌండ్‌ సర్వీస్‌ వాహనాల రాకపోకల సమయంలో ప్రయాణికులు, బ్యాగేజీ సురక్షితంగా తరలిపోయేందుకు ఒక నూతన సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు.
  9. వర్షపు నీరు సాఫీగా ప్రవహించేందుకు వీలుగా 16 లక్షల చదరపు మీటర్ల ప్రాంతాన్ని చదును చేశారు.
  10. అలాగే వాన నీటిని నిల్వచేసి, తిరిగి శుద్దిచేసిన తర్వాత ఉపయోగించుకోవడానికి 450 ఎంఎల్‌డీ సామర్థ్యంగల రిజర్వాయర్‌ను నిర్మించారు.
  11. ఇండియాలోనే పేపర్‌లెస్‌ ఈ-బోర్డింగ్‌ సదుపాయాన్ని కల్గిస్తున్న ఏకైక విమానాశ్రయం అయిన ఆర్‌జీఐఏ… ఇప్పుడు కృత్రిమ మేథతో పనిచేసే అడ్వాన్స్‌డ్‌ క్యూ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్లను ఉపయోగించడం మొదలుపెట్టింది.
  12. ఈ సొల్యూషన్స్‌ ద్వారా ప్రయాణికులు వేచి ఉండాల్సిన సమయం తెలుస్తుంది. సామాజిక దూరా న్ని పాటించడాన్ని పర్యవేక్షిస్తుంది. ఒక నిర్దిష్ట సమయంలో ప్రయాణికుల గణాంకాల్ని సరిగ్గా అంచనావేస్తుంది.

Recent

- Advertisment -spot_img