Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం పథకంలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాయితీ రుణాలు, సబ్సిడీలను అందిస్తోంది. ఎస్సీల నుంచి మొత్తంగా 44,800 అప్లికేషన్లు రాగా వర్గీకరణ చట్టం ప్రకారం మూడు గ్రూపులకు 1,9,5 శాతంతో రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. బీ గ్రూపు నుంచే అధిక దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జూన్ 2న మంజూరు పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది.