Homeతెలంగాణరాజనీతి స్ట్రాటజీస్ చెప్పిందే నిజమైంది

రాజనీతి స్ట్రాటజీస్ చెప్పిందే నిజమైంది

– ఎగ్జిట్​ పోల్స్​లో సక్సెస్

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజనీతి స్ట్రాటజీస్(రాష్ట్ర) చెప్పిన ఎగ్జిట్​ పోల్స్ నిజమయ్యాయని ఆ సంస్థ నిర్వాహకుడు రజనీకాంత్ ఎర్రబెల్లి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజనీతి స్ట్రాటజీస్​ ఎగ్జిట్ పోల్స్​ ప్రకారం.. కాంగ్రెస్​కు 56 ప్లస్ 5 అటు ఇటుగా, బీఆర్ఎస్​కు 45 స్థానాలు ప్లస్ 5 సీట్లు అటుఇటుగా, బీజేపీకి 10 స్థానాలు ప్లస్ 2 సీట్లు అటుఇటుగా ఎంఐఎం 7 స్థానాలు, ఇతరులకు 1 సీటు వస్తుందని చెప్పామన్నారు. రాజనీతి స్ట్రాటజీస్ చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీకి 64, బీఆర్ఎస్​కు 39, బీజేపీ 8, ఎంఐఎంకు 7 సీట్లు దక్కాయన్నారు. ఇతరులలో సీపీఐకు ఒక స్థానం వచ్చిందన్నారు. జాతీయ, ఢిల్లీ సంస్థలకు దీటుగా సర్వేలు నిర్వహిస్తున్న రాజనీతి స్ట్రాటజీస్​ను ప్రోత్సహించాలని ఆయన కోరారు.

Recent

- Advertisment -spot_img