న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకునేందుకు ఆయన సహకరించారని ఆరోపిస్తూ 12 పార్టీలు కలిసి ఈ తీర్మానం ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ తెలిపారు. దేశ చరిత్రలో ఇదో చీకటి రోజుగా అహ్మద్ పటేల్ అభివర్ణించారు. కాంగ్రెస్, తెరాస, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ తదితర పార్టీలు ఈ నోటీసు ఇచ్చినట్లు చెప్పారు.