హైదరాబాద్ః నటి రమ్యకృష్ణ 50వ భర్త్ డే సెలబ్రషన్స్ కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకుంది. రమ్యకృష్ణ భర్త, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ, కొడుకు రిత్విక్ వంశీతోపాటు కుటుంబ సభ్యులు కరోనా వలన ఇంట్లోనే ఆమేతో కేక్ కట్ చేయించి బర్త్డేని సెలబ్రేట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను రమ్యకృష్ణ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు, సన్నిహితులు ఆమెకు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రమ్యకృష్ణ ప్రస్తుతం తమిళ తెలుగు భాషల్లో సీరియల్స్ వెబ్ సిరీస్ మరియు సినిమాలతో నటిస్తూ బిజీగా ఉన్నారు. గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.