Homeసినిమాట్రైబ‌ల్​ గళ్స్​గా పూజా, రష్మిక

ట్రైబ‌ల్​ గళ్స్​గా పూజా, రష్మిక

పూజాహెగ్డే, రష్మిక మంద‌న్నా.. ద‌క్షిణాదిన టాప్ హీరోయిన్లు గా కొన‌సాగుతూ ఫుల్ జోష్ మీదున్నారు.

ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టుల్లో మెరువ‌బోతున్నారు.

ఇందులో విశేష‌మేముంది అనుకుంటున్నారా..? ఈ ఇద్ద‌రు భామ‌ల్లో ఉన్న కామ‌న్ థింగ్ ఏంటంటే.. ఇద్ద‌రూ ట్రైబ‌ర్ గళ్స్ (గిరిజ‌న యువ‌తులు)గా న‌టిస్తున్నారు.

ఆచార్య‌లో రాంచ‌ర‌ణ్ కు జోడీగా న‌టిస్తోంది పూజాహెగ్డే. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రి ల‌వ్ ట్రాక్ సంబంధించిన లుక్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

మ‌రోవైపు క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా కూడా పుష్ప‌లో గిరిజ‌న తెగ‌కు చెందిన అమ్మాయిగా క‌నిపించ‌నుంది.

ఇప్ప‌టివ‌ర‌కు గ్లామ‌ర్ రోల్స్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ‌లు ఈ సారి కాస్త రూటు మార్చి డీగ్లామరైజ్‌డ్ రోల్స్ లో క‌నిపించి సంద‌డి చేసేందుకు రెడీ అవుతున్నారు.

పూజాహెగ్డే ఇప్ప‌టికే హిందీలో తానెంటో ప్రూవ్ చేసుకోగా..ర‌ష్మిక ఈ ఏడాది బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది, ప్ర‌స్తుతం రెండు ప్రాజెక్టుల్లో న‌టిస్తోంది ర‌ష్మిక‌.

Recent

- Advertisment -spot_img