Homeతెలంగాణఅయ్యో పాపం.. వైద్యం కోసం 2 ల‌క్ష‌లు దాచుకుంటే ఎలుక‌ల పాలు #Money #Rats

అయ్యో పాపం.. వైద్యం కోసం 2 ల‌క్ష‌లు దాచుకుంటే ఎలుక‌ల పాలు #Money #Rats

ఎండ‌న‌క, వాన‌న‌క‌.. నిత్యం కూర‌గాయ‌లు అమ్ముకుంటూ.. వైద్యం కోసం రూపాయికి రూపాయి పోగు చేసుకున్నాడు.

అలా పోగు చేసుకున్న రూ. 2 ల‌క్ష‌ల‌ను ఎలుక‌లు ప‌ట‌ప‌ట కొరికేశాయి.

ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని వేమునూరు గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలోని ఇందిరాన‌గ‌ర్ తండాలో చోటు చేసుకుంది.

భూక్య రెడ్యా అనే వ్య‌క్తి కూర‌గాయ‌లు అమ్ముకుంటూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు.

అనారోగ్యానికి గురైన రెడ్యా.. వైద్య ఖ‌ర్చుల నిమిత్తం రూ. 2 ల‌క్ష‌ల‌ను దాచి పెట్టాడు. ఆ న‌గ‌దును ఇంట్లోని బీరువాలో దాచాడు.

అయితే ఎలుక‌లు బీరువాలోకి దూరి ఆ నోట్ల క‌ట్ట‌ల‌ను ప‌ట‌ప‌ట కొరికేశాయి. ఒక్క నోటును కూడా వ‌ద‌ల‌కుండా తినేశాయి.

అన్ని రూ. 500 నోట్లే. ఆ నోట్ల‌ను చూసి రెడ్యా బోరున విల‌పించాడు.

ఎలుక‌లు కొరికిన న‌గ‌దును తీసుకుని మ‌హ‌బూబాబాద్‌లోని ఎస్బీఐ బ్యాంక్‌కు రెడ్యా వెళ్లాడు.

ఆ నోట్లు చెల్లుబాటు కావ‌ని చెప్ప‌డంతో చేసేదేమీ బాధిత వ్య‌క్తి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.

ఎవ‌రైనా త‌న వైద్యం కోసం సాయం చేయాల‌ని రెడ్యా వేడుకుంటున్నాడు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img