RCB : ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నేడు ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎందుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ బెంగళూరు చేయనుంది. బెంగళూరు 4 మ్యాచ్ల్లో 3 గెలిచి ఫామ్లో ఉంది. కానీ మొత్తం తలక్రిందులు అయ్యింది. ఆర్సీబీ కేవలం 10 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ బ్యాటర్లు ఫిలిప్ సాల్ట్ 32, విరాట్ కోహ్లీ 22 పరుగులు చేసి ఔట్ అయ్యారు. అయితే దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్స్టోన్ కేవలం సింగల్ డిజిట్ చేసి ఔట్ అయ్యారు. ప్రస్తుతం 11 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.