ఇదేనిజం, ముధోల్: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బిలోలి గ్రామంలో సందీప్ ఫౌండేషన్ చైర్మన్ మంగాయి సందీప్ రావు తన సొంత నిధులతో వలంటీర్లను నియమించారు. వలంటీర్లు రెగ్యులర్ పాఠాలు చెప్పడంతో పాటూ సాయంత్రం ట్యూషన్ కూడా చెబుతారన్నారు. తాను ముందు ముందు ప్రభుత్వ పాఠశాలలకు అండగా నిలబడతానన్నారు. ఈ కార్యక్రమంలో బిల్లుని సర్పంచ్ నర్సింగ్ రావు, కాంతారావు మంగాయి నర్సింగ్ రావు, వహీద్ సాయిలు టీమ్ మెంబర్స్, షఫీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు