వైసీపీ కేడర్ ఫుల్ కన్ఫ్యూజన్ ..
‘మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. నిలకడ లేని మనసు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడు? పార్టీని ఎలా నడుపుతాడు’ పవన్ కల్యాణ్ మీద తరుచూ వైసీపీ శ్రేణుల నుంచి.. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ నుంచి వచ్చే ప్రధాన ఆరోపణ. ఇక వైసీపీ సోషల్ మీడియా సైతం అవకాశం దొరికిన ప్రతీసారి పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల మీద పోస్టులు పెడుతూ ఉంటుంది.
అయితే తాజాగా వైసీపీ క్యాడర్ కు షాక్ ఇచ్చేలా పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ బోల్డ్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ప్రజల మనిషి అని.. ఆయన ఎప్పుడూ జనం గురించే ఆలోచిస్తారని ఆమె అన్నారు. అంతేకాక మూడు పిల్లల్ల విషయం మీద ఆయనను విమర్శించడం సరికాదని కూడా సూచించారు. దీంతో ప్రస్తుతం వైసీపీ కేడర్ కాస్త గందరగోళానికి గురైనట్టు తెలుస్తోంది.
పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఎప్పుడూ పవన్ కు అనుకూలంగా మాట్లాడలేదు. పైగా ఫ్యాన్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేది. కానీ తాజాగా ఆమె పవన్ కల్యాణ్ కు కాస్త అనుకూలంగా మాట్లాడటం గమనార్హం.
ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ కు కుటుంబం నుంచి కూడా సపోర్ట్ వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అన్న చిరంజీవి సైతం పవన్ కు అనుకూలంగా స్టేట్ మెంట్ ఇచ్చారు. తాజాగా మాజీ భార్య కూడా తోడయ్యారు. ఇక నాగబాబు ఎప్పటి నుంచి పవన్ వెంటే ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తమకు మరింత బలం రాబోతున్నదని జనసైనికులు ఖుషీ అవుతున్నారు