భారత్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తోందని, అందుకే ఏప్రిల్ 2 నుంచి ఆ దేశంపై భారీగా ప్రతీకార సుంకాలను అమలు చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. సుదీర్ఘకాలంగా చైనా, భారత్లతో సహా పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు విధిస్తున్నాయని ఇది సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఏప్రిల్ ఒకటి నుంచే అమలు చేయాలనుకున్నా, అలా చేస్తే మీమ్స్ బారిన పడాల్సి వస్తుందనే ఆలోచనతోనే ఏప్రిల్ 2 నుంచి వసూలు చేయనున్నట్లు ప్రకటించారు.