Homeహైదరాబాద్latest Newsరేవంత్​ సర్కారు సంచలన నిర్ణయం.. కేసీఆర్ పేరు మార్చేశారు

రేవంత్​ సర్కారు సంచలన నిర్ణయం.. కేసీఆర్ పేరు మార్చేశారు

ఇదేనిజం, ప్రధాన ప్రతినిధి: ‘కరీంనగర్ సర్క్యూట్ గెస్ట్​హౌస్​’ బోర్డును ఆర్అండ్​బీ అధికారులు సోమవారం తొలిగించారు. గతంలో శిథిలావస్థకు చేరిన భవనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పునరుద్ధరించి, దానికి ‘కరీంనగర్ సర్క్యూట్ గెస్ట్​హౌస్​’ పేరును పెట్టారు. ఉన్నపళంగా గెస్ట్​హౌస్​ బోర్డును తొలిగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలగింపుపై అధికారుల్లో కూడా స్పష్టత కరువైంది. దీనిపై మాట్లాడేందుకు విముఖత చూపుతున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బోర్డును తొలిగించారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్​పై ఆరోపణలు చేస్తున్నాయి. బోర్డు తొలిగింపు ఫొటోలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్​గా మారగా, పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img