ఇదేనిజం, ప్రధాన ప్రతినిధి: ‘కరీంనగర్ సర్క్యూట్ గెస్ట్హౌస్’ బోర్డును ఆర్అండ్బీ అధికారులు సోమవారం తొలిగించారు. గతంలో శిథిలావస్థకు చేరిన భవనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పునరుద్ధరించి, దానికి ‘కరీంనగర్ సర్క్యూట్ గెస్ట్హౌస్’ పేరును పెట్టారు. ఉన్నపళంగా గెస్ట్హౌస్ బోర్డును తొలిగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలగింపుపై అధికారుల్లో కూడా స్పష్టత కరువైంది. దీనిపై మాట్లాడేందుకు విముఖత చూపుతున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బోర్డును తొలిగించారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్పై ఆరోపణలు చేస్తున్నాయి. బోర్డు తొలిగింపు ఫొటోలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్గా మారగా, పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.