Homeహైదరాబాద్latest Newsరేవంత్​.. మొగోడివైతే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

రేవంత్​.. మొగోడివైతే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

  • గట్టి నాయకులు కొట్టుకుపోరు.. గడ్డిపోచలే కొట్టుకుపోతాయి
  • ఎమ్మెల్యే సంజయ్​ దొంగల్లో కలిసిండు
  • సంజయ్ ఎందుకు పార్టీ మారిండు?
  • 4500 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పించినందుకా?
  • వియ్యంకుడి బిల్లుల కోసమా?
  • మేం రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేలను కలుపుకున్నాం
  • రేవంత్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిండు
  • అందుకే ఆనాడు టీడీఎల్పీని విలీనం చేసుకున్నాం
  • బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఇదేనిజం, జగిత్యాల టౌన్: రేవంత్ రెడ్డి మొగోడైతే తన పార్టీలో చేర్చుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ సవాల్ విసిరారు. కొందరు ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారని.. అటువంటి పార్టీ పట్ల భయం అక్కర్లేదని పేర్కొన్నారు. ‘తాము గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని చాలా మంది విమర్శిస్తున్నారు. 2014లో బీఆర్ఎస్​ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రేవంత్ కుట్ర చేశారు. అందుకే అప్పుడు రాజ్యాంగబద్ధంగా టీడీఎల్పీని విలీనం చేసుకున్నాం. ఆ తర్వాత 2018 ఎన్నికల అనంతరం కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒకేసారి చేర్చుకొని విలీన ప్రక్రియ పూర్తి చేశాం’ అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. గాలికి కొట్టుకుపోయేది గ‌డ్డిపోచ‌లు మాత్ర‌మే గడ్డపారలు కాదు అని జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్‌ను ఉద్దేశించి ఆరోపించారు. సోమవారం జ‌గిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. జ‌గిత్యాల‌కు ప‌ట్టిన శ‌ని పోయింద‌ని ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఉత్సాహంగా ఉన్న‌ట్లు అనిపిస్తోంది. కొన్ని సంద‌ర్భాల్లో క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌షుల విలువ తెలుస్త‌ది. గాలికి గ‌డ్డ‌పార‌లు కొట్టుకుపోవు. గ‌ట్టి నాయ‌కులు కొట్టుకుపోరు. గాలికి కొట్టుకుపోయేది గ‌డ్డిపోచ‌లు మాత్ర‌మే. గ‌డ్డిపార‌ల్లాంటి మీరు వెళ్ల‌లేదు.. ఒక గ‌డ్డిపోచ మాత్ర‌మే కొట్టుకుపోయింది అని ఎమ్మెల్యే సంజ‌య్‌ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కవితక్క కష్టపడితే సంజయ్​ ఎమ్మెల్యే అయ్యిండు
‘క‌విత‌క్క‌తో స‌హా వేల మంది క‌ష్ట‌ప‌డితే ఆయ‌న ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే దొంగ‌ల్లో క‌లిసిండు. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతుల‌కు ఆశ‌ప‌డి పోయిండు. ఎమ్మెల్యే బుద్ది ఇవాళ తెలిసి వ‌చ్చింది. అభివృద్ధి కోసం పోయినా అని సంజ‌య్ అన్నాడు. జ‌గిత్యాల జిల్లా ర‌ద్దు చేస్తా.. మెడిక‌ల్, న‌ర్సింగ్ కాలేజీ ర‌ద్దు చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నందుకు సంజ‌య్ కాంగ్రెస్‌లోకి వెళ్లిండా..? రాష్ట్రంలో ఎక్క‌డా లేని విధంగా 4500 డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినందుకు ర‌ద్దు చేయ‌మ‌ని పోయావా..? ఏ అభివృద్ధి ఆశించి పోయిండు సంజ‌య్. ఆయ‌న పోయింది ఒక్క‌దాని కోసం.. ఇయ్యంకుడి బిల్లులు రావాలి.. ఆయ‌న క్ర‌ష‌ర్ ఆగొద్ద‌ని పోయిండు. సొంత అభివృద్ధి కోసం పోయిండు.. జిగిత్యాల అభివృద్ధి కోసం పోలేదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

మ‌రి ఎవ‌ర్నీ పిచ్చి కుక్క మాదిరి కొట్టాలి..?
పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డే ఎమ్మెల్యేల‌ను కుక్క‌ల మాదిరి రాళ్ల‌తో కొట్టి చంపాల‌ని రేవంత్ రెడ్డి గ‌తంలో మాట్లాడారు. మ‌రి ఇప్పుడు ఎవ‌రు పిచ్చికుక్క‌.. ఎవ‌ర్నీ రాళ్ల‌తో కొట్టిచంపాలి. మీ చెమ‌ట‌, మీ ర‌క్తం ధార‌పోసి గెలిపించాక‌ పార్టీ ఫిరాయింపులు చేస్తే అలాంటి వారిని రాళ్ల‌తో కొట్టిచంప‌మ‌ని రేవంత్ రెడ్డే చెప్పిండు. మ‌రి ఎవ‌ర్నీ పిచ్చి కుక్క మాదిరి కొట్టాలి..? ఎవ‌ర్నీ రాళ్ల‌తో కొట్టాల్సిన అవ‌స‌రం లేదు కానీ.. రేవంత్ రెడ్డి నీవు మొగోడివి అయితే.. నీకు ద‌మ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు రా.. ఓట్ల‌తో కొట్టి ఆ ఆరుగురిని రాజ‌కీయంగా శ్వాశ‌తంగా స‌మాధి చేసే బాధ్య‌త తెలంగాణ స‌మాజం తీసుకుంట‌ది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img