HomeతెలంగాణRevanth reddy:బీజేపీని, బీఆరెస్ ను వేరుగా చూడొద్దు.- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Revanth reddy:బీజేపీని, బీఆరెస్ ను వేరుగా చూడొద్దు.- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Revanth reddy:బీజేపీ, బీఆరెస్ రెండూ ఎన్నికల చట్టాల్లో మార్పులను ఉపయోగించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు . దీనిని ఎదుర్కొనేందుకు చేయాల్సిన కార్యాచరణ కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు
ఇతర పార్టీలను ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు . గాంధీ భవన్ నుంచి, గ్రామస్థాయి వరకు అందరూ అప్రమత్తంగా పనిచేయాలని కోరారు .

బీజేపీ, బీఆరెస్ ను ఎదుర్కొనేందుకు మన శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధులను చేసుకోవాలని అన్నారు . మండల, డివిజన్, జిల్లా, పట్టణ అధ్యక్షులకు బోయినపల్లి రాజీవ్ నాలెడ్జ్ సెంటర్ లో జూలై 18న ట్రైనింగ్ ఉంటుందన్నారు . ఈ నెల 15లోగా మండలాలు, డివిజన్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేస్తామన్నారు . పరిపాలన ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు .

రాష్ట్రంలో 34,654 పోలింగ్ బూత్ లు ఉన్నాయన్నారు.యాక్టివ్ గా ఉన్న బూత్ ఎన్ రోలర్స్ ను బీఎల్ఏ లుగా నియమించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయి. ప్రతీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు వచ్చే 12వేల ఓట్లను తొలగించారని అన్నారు . కుటుంబానికి 5 ఓట్లు ఉంటే 2 ఓట్లు డిలీట్ చేశారని అన్నారు

Recent

- Advertisment -spot_img