Homeహైదరాబాద్latest Newsరేవంత్ 28 సార్లు ఢిల్లీ వెళ్లి.. రాష్ట్రానికి 28 రూపాయలు కూడా తీసుకురాలేదు.. కేటీఆర్ సంచలన...

రేవంత్ 28 సార్లు ఢిల్లీ వెళ్లి.. రాష్ట్రానికి 28 రూపాయలు కూడా తీసుకురాలేదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహా ధర్నా జరుగుతుంది. ఈ మహా ధర్నాలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ ధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి 28 సార్లు ఢిల్లీ వెళ్లి.. రాష్ట్రానికి 28 రూపాయలు కూడా తీసుకురాలేదు అని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి పేదల కోసం పని చేయడంలేదు… అతను అల్లుడి కోసం, అదానీ కోసం, అన్న కోసం, తమ్ముడి కోసం పని చేస్తున్నాడు అని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ రెడ్డికి సొంత నియోజకవర్గ గిరిజన, దళిత ప్రజలను కలిసేందుకు సమయం లేదు.. సొంత ప్రజల నుండి తిరుగుబాటు ఎదుర్కొంటున్నారు అని అన్నారు. కొడంగల్‌కు అధికారులు వెళితే గిరిజనులు నిరసన మాత్రమే తెలియజేశారు..అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికించి, ఉరికించి కొట్టేవాళ్లు అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసారు.

Recent

- Advertisment -spot_img