Homeఫ్లాష్ ఫ్లాష్Rice Millers: రాష్ట్ర రైస్ మిల్లర్స్ ప్రధాన కార్యదర్శిగా అన్నమనేని సుధాకర్ రావు

Rice Millers: రాష్ట్ర రైస్ మిల్లర్స్ ప్రధాన కార్యదర్శిగా అన్నమనేని సుధాకర్ రావు

Rice millers.:

కరీంనగర్ జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నర్సింగరావ్

సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఇమ్మడి సోమనర్సయ్య

తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ 2గా కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖులు అన్నమనేని సుధాకర్ రావుని నియమించారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నర్సింగరావ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఇమ్మడి సోమనర్సయ్య ను నియమిస్తున్నామని వెల్లడించారు. ఈ మేరకు అసోసియేషన్ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంపా నాగేందర్ నేడు  ఒక ప్రకటనలో వెల్లడించారు. మిల్లింగ్ ప్రక్రియ, రైస్ ఇండస్ట్రీపై సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తిగా ఇటు ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి మద్య వారధిగా సుధాకర్ రావు పనిచేస్తారని అభిప్రాయపడ్డారు. ఈ నియామకం ద్వారా తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం మేరకు మిల్లింగ్ ప్రక్రియ వేగంగా జరగడానికి, మిల్లింగ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారాలకు దోహదపడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Recent

- Advertisment -spot_img