Homeఅంతర్జాతీయం#Riemann Hypothesis : లెక్కకు జవాబు చెప్పి రూ.7.3 కోట్లు గెలుచుకున్న హైదరాబాద్ ప్రొఫెసర్ కుమార్...

#Riemann Hypothesis : లెక్కకు జవాబు చెప్పి రూ.7.3 కోట్లు గెలుచుకున్న హైదరాబాద్ ప్రొఫెసర్ కుమార్ ఈశ్వరన్….

  • రీమన్ హైపోథీసిస్ లెక్క తేల్చిండు
  • 161 ఏళ్లుగా ఆన్సర్ లేని ప్రశ్నకు శ్రీనిధి ఇనిస్టిట్యూట్ప్రొఫెసర్ పరిష్కారం
  • రూ.7.3 కోట్లు గెలుచుకున్న కుమార్ ఈశ్వరన్

మ్యాథమేటిక్స్​లో 161 ఏళ్లుగా ‘జవాబు’ లేని సవాల్​ అది. ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఆ థియరీకి పరిష్కారం దొరకలేదు.

కానీ, హైదరాబాద్​కు చెందిన డాక్టర్​ కుమార్​ ఈశ్వరన్​ దానికి పరిష్కారం కనుగొన్నారు.

‘రీమన్​ హైపోథీసిస్​’ వేసిన చిక్కుముడులను శ్రీనిధి ఇన్‌‌స్టిట్యూట్​లో మ్యాథ్స్​ ప్రొఫెసర్​ అయిన ఆయన విప్పేశారు. ఆ సిద్ధాంతాన్ని ‘ప్రూవ్​’ చేసి చూపించారు.

పరిష్కారానికి మిలియన్ డాలర్లు…

లెక్కల్లో పరిష్కారం కాని టాప్​ పది సిద్ధాంతాల్లో రీమన్​ హైపోథీసిస్​ మొదటి స్థానంలో ఉంటుంది.

దీన్ని పరిష్కరిస్తే పది లక్షల డాలర్లు (సుమారు రూ.7.3 కోట్లు) బహుమతి ఇస్తామని కేంబ్రిడ్జిలోని క్లే మ్యాథమేటిక్ ​​సంస్థ ప్రకటించింది.

ప్రముఖ మ్యాథ్స్​ సైంటిస్ట్​​ కార్ల్​​ ఫ్రెడరిక్​ గాస్​ చేసిన లెక్కల నుంచి రీమన్​ హైపోథీసిస్​​ వచ్చింది.

ఆయన సూత్రం ప్రకారం ఏదైనా ఒక సంఖ్య కంటే తక్కువ ప్రధాన సంఖ్యల సంఖ్యను అంచనా వేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

తర్వాతి కాలంలో జార్జ్ ​​ఫ్రెడరిక్​ బెర్నార్డ్ ​​రీమన్​.. ఆ సూత్రాన్ని మెరుగుపరిచారు. సంక్లిష్ట వేరియబుల్​ ఫంక్షన్ల కాలిక్యులస్​తో కొత్త పద్ధతిని ఉపయోగించారు.

ఐదేళ్లుగా రివ్యూలు…

సంక్షిష్ట వేరియబుల్​లో ప్రత్యేకంగా తీసుకున్న ఫంక్షన్​లో విశ్లేషణాత్మక ప్రవర్తనను నిర్ణయిస్తే రీమన్​​హైపోథీసిస్​ను​పరిష్కరించవచ్చని ఈశ్వరన్​​ రుజువు చేశారు.

సంఖ్యల అంకగణిత లక్షణాలను ఉపయోగించడంతో హైపోథీసిస్​​ సక్సెస్​ అయినట్టు తేల్చారు.

ఈశ్వరన్ ​​రుజువు చేసిన హైపోథీసిస్​ను దాదాపు ఐదేళ్ల కిందట 2016లోనే ఇంటర్నెట్​లో పెట్టారు.

దీన్ని పరిశీలించేందుకు శ్రీనిధి విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని 2021 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు.

ఈ కమిటీకి జాతీయ స్థాయి సలహాదారుగా దేశ శాస్ట్ర సాంకేతిక శాఖ మాజీ కార్యదర్శి టి. రామస్వామి ఉన్నారు.

శ్రీనిధి ఇనిస్టిట్యూట్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ ప్రొఫెసర్​ నర్సింహా రెడ్డి, హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ ప్రొఫెసర్​ సీతారామన్​, చెన్నైలోని ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మ్యాథ్స్​ అండ్​ సైన్స్​ ప్రొఫెసర్​ కె. శ్రీనివాస రావు, సెంటర్​ ఫర్​ పాలసీ స్టడీస్​ ప్రొఫెసర్​ శ్రీనివాస్​, ఐఐటీ హైదరాబాద్​ ప్రొఫెసర్​ వినాయక్​ ఈశ్వరన్​లు సభ్యులుగా ఉన్నారు.

ఈ సిద్ధాంతాన్ని1,200 మందికిపైగా మ్యాథ్స్​ నిపుణులు రివ్యూ చేశారు.

ఇంటర్నేషనల్​ నిపుణులు సమీక్షలు పంపిస్తే ఈశ్వరన్​ సమాధానాలు ఇచ్చారు.

ఈ ఏడాది మే 16న జరిగిన చివరి సమావేశంలో రీమన్​​ హైపోథీసిస్​కు ఈశ్వరన్​ ప్రతిపాదించిన సిద్ధాంతం సరైందని కమిటీ తేల్చింది.

ఈ సిద్ధాంతం గురించి పూర్తి సమాచారాన్ని మొదటగా ఈ–బుక్ ద్వారా ప్రచురించి, తర్వాత పుస్తక రూపంలో తీసుకురావాలని నిర్ణయించారు…

Recent

- Advertisment -spot_img