RR vs RCB: ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నేడు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎందుకుంది. దీంతో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ ఐదు మ్యాచ్లు ఆడి మూడింటిలో విజయం సాధించింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా అదే సంఖ్యలో మ్యాచ్లు ఆడినప్పటికీ రెండింట్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
ఆర్సీబీ జట్టులో రజత్ పాటిదార్, జితేష్ శర్మ , ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్స్టోన్, యష్ దయాల్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ ఏంజెల్ఉడ్ ఉన్నారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్ మెయర్, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ ఉన్నారు.