Homeహైదరాబాద్latest Newsరైతుబంధు అందరికీ ఇస్తాం : Ponnam Prabhakar

రైతుబంధు అందరికీ ఇస్తాం : Ponnam Prabhakar

బీఆర్ఎస్ పార్టీ వర్షపాతంపై రాజకీయం చేస్తోందని రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరవు రాలేదని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్షపాతంపై రాజకీయం చేస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారన్నారు. ‘డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిన వద్ద బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడగండని, ఇందిరమ్మ ఇండ్లు కట్టిన వద్ద తాము ఓట్లు అడుగుతాం అని’ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. రైతు బందు అందరికీ ఇస్తామన్నారు. గతంలో రైతుబంధు మార్చ్ నెల వరకు ఇచ్చారని తెలిపారు. “రాష్ట్రం 7లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, 40వేల కోట్ల బిల్లులు ఆగిపోయి ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు. కేంద్రంతో సత్సంబంధాలతో ఉండి.. రాష్ట్రానికి రావాల్సిన వాటాను తప్పకుండా తీసుకుంటామన్నారు.

Recent

- Advertisment -spot_img