Homeఫ్లాష్ ఫ్లాష్Saichand:రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా సాయిచంద్‌ భార్య

Saichand:రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా సాయిచంద్‌ భార్య

Saichand: రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా వేద ర‌జ‌ని నియమించనున్నారు . చైర్మ‌న్‌గా ఉన్న గాయ‌కుడు సాయిచంద్‌.. ఇటీవ‌లే గుండెపోటుతో మ‌ర‌ణించడంతో ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి కే సీఆర్ అండగా నిలిచారు సాయిచంద్ చనిపోయేనాటికి నిర్వహిస్తున్న పోస్టును భార్య ర‌జ‌నికే ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. కేసీఆర్ ఆదేశాల మేర‌కు త్వరలో ఉత్తర్వులు వెలుపడనున్నాయి

కాగా సాయిచంద్‌ కుటుంబానికి రూ. కోటిన్నర ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం నుంచి ఇస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. సాయిచంద్‌కు ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయమైన రజనీని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు చరీష్ , కుమార్తె నది ఉన్నారు.

Recent

- Advertisment -spot_img